శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. ఇక నిన్న కాకినాడలో “రణరంగం” ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా శర్వానంద్ మాట్లాడుతుండగా… కొందరు అభిమానులు వేదిక పైకి దూసుకు వచ్చి శర్వాకు దండలు వేయడమే కాకుండా అతడి కాళ్ళకు పాద నమస్కారాలు చేశారు. వెంటనే తన అభిమానుల పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అనవసరంగా తన కాళ్ళకు మొక్కి తనను గొప్పవాడిగా చూడవద్దని, అలా పాద నమస్కారాలు చేయాలి అనుకుంటే వారివారి తల్లితండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవాలని అభిమానులకు సూచించాడు. అనవసరంగా తనలాంటి వాళ్లకు పాద నమస్కారాలు చేసి పాద నమస్కారాలకు ఉన్న పవిత్రను పోగొట్టవద్దు అంటూ శర్వా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై శర్వానంద్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. హైదరాబాద్ నుండి తాను పవన్ తో కలిసి ఒకే విమానంలో రాగా… తాను ఆ విమానంలో బిజినెస్ క్లాస్ లో కూర్చుని ప్రయాణం చేస్తే, పవన్ అదే విమానంలో ఎకానమీ క్లాస్ లో కూర్చుని సామాన్యుడిలా ప్రయాణం చేశాడట. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో పవన్ ఎకానిమీ క్లాస్ లో ప్రయాణిస్తుంటే తాను బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేయడం తనకు తలవంపుగా మారిందని అన్నారు. ఇదే విషయాన్ని తాను పవన్ తో ప్రస్తావిస్తే తాను జనం కోసం అన్నీ వదులుకుని వచ్చానని, కానీ సినిమాలలో నటిస్తున్నావు కాబట్టి ఆమాత్రం స్థాయి కొనసాగించాలి అంటూ పవన్ తనతో అన్నారని చెప్పుకొచ్చారు. అలాంటి సంస్కారం ఉన్న వ్యక్తులకు పాద నమస్కారాలు చేయాలి కానీ తనలాంటి వాళ్లకు కాదు అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అనే విషయం ఆసక్తికరంగా మారింది.
సమంత చేసే ఆ పని నాగ చైతన్యకు నచ్చడం లేదట…!?