సూపర్స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మహేశ్ నటిస్తోన్న 26వ చిత్రమిది. ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నవంబర్ 22న రిలీజైన టీజర్.. గత వంద గంటలుగా యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్ ప్లేసులో ఉంది. గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ.. విడుదలైన గంటగంటకు వ్యూస్, లైక్స్తో రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లో దూసుకువెళుతుంది. 100 గంటల్లో 22 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్, లక్షల్లో లైక్స్ రాబట్టడమే కాకుండా ఇప్పటికీ ట్రెండింగ్లో మొదటి స్థానంలోనే కొనసాగుతుందీ టీజర్. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
previous post