telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ వీరాభిమాని సరికొత్త ఆలోచన ఈ రేడియం విగ్రహాలు

NTR

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నంద‌మూరి తార‌క రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆయన గురించి తెలియ‌ని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ దివంగత నేత ఇప్పటికి ఎంతోమంది స్ఫూర్తిదాయకం. ఇక ఆయ‌న వీరాభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిలో ఓ వీరాభిమాని త‌న అభిమాన హీరోపై ఉన్న అభిమానాన్ని ప్ర‌త్యేకంగా చాటుకున్నారు. “ఎన్‌.బి.కె సేవాసమితి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ర్నాటి కొండ‌ల‌రావు ఎన్టీఆర్ రేడియం విగ్ర‌హాల‌ను త‌యారు చేయించారు. ఈ విగ్ర‌హాల త‌యారీ కోసం ఆయ‌న బాంబేకి వెళ్లార‌ట. అలాగే ఈ విగ్ర‌హాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్క‌రింప చేశారు. ఫాద‌ర‌ర్స్ డే సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను క‌లిసి ఆయ‌న‌కు కూడా ఎన్.టి.ఆర్ రేడియం విగ్ర‌హాన్ని అందించార‌ట‌. ఆ విగ్ర‌హాన్ని చూసిన బాల‌య్య ఎంతో ఆనంద‌ప‌డి కొండ‌ల‌రావును అభినందించడం విశేషం. అయితే ఇంతవరకు ఆయన అభిమానులకు ఎవరికీ రాని ఆలోచన కొండలరావుకు రావడం గమనార్హం.

Related posts