పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకు క్లాస్ ఇమేజ్తో సినిమాలు చేస్తూ వచ్చిన హీరో రామ్. ఈసారి మాత్రం విభన్నమైన గెటప్లో కనపడబోతున్నారు. రామ్ను పక్కా హైదరాబాదీ మాస్ కుర్రాడిగా రామ్ను ప్రెజంట్ చేస్తున్నారు దర్శకుడు పూరి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యూనిట్ అంతా వరంగల్ బోనాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ “నేను రామ్ను మాస్గా చూపించానని అంటున్నారందరూ. కానీ.. తనలో మాస్ ఉంది. దాన్ని నేను బయటకు తెచ్చానంతే. రామ్ వెజిటేరియన్ వేషం వేసుకున్న నాన్ వెజిటేరియన్. తనకు సినిమాలే లోకం. సినిమాలు గురించి తప్ప మరోటి ఆలోచించడు. నాకు `టెంపర్` తర్వాత మరో సరైన హిట్ లేదు. మంచి ఆకలి మీదున్నసమయంలో రామ్ దొరికాడు. తను రామ్ పోతినేని కాదు.. రామ్ చిరుతపులి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ పిలవకముందే సీన్లోకి దూకుతుంటాడు” అంటూ రామ్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు.
హృతిక్ రోషన్ పై కంగనా వ్యాఖ్యలు