టాలీవుడ్లో అగ్ర కథానాయిక పూజా హెగ్డే దూసుకెళ్తోంది. వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లతో పూజా హెగ్డే చాలా బిజీగానే ఉంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత నుండి వాల్మీకి వరకూ అన్నీ క్రేజీ సినిమాలే. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఈ బ్యూటీ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా జాన్లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ. సౌత్లో బిజీయెస్ట్ హీరోయిన్గా చెలామణి అవుతోంది పూజా. అదే రేంజ్లో భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్తో సైన్ చేసిన సినిమా కోసం.. పూజా ఏకంగా రూ. 2.5 కోట్ల పారితోషికం తీసుకోనుందని తెలుస్తోంది. మెగా ప్రాజెక్టు ఆచార్యలో కీ రోల్కు భారీగానే వసూలు చేసిందట ఈ భామ. కాగా తెలుగులో ఈ బ్యూటీ నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
previous post
next post