ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీని రెండు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. రాజకీయాలలోకి రాహుల్ బాధ్యతలు తీసుకోకముందు నుండే ఆమెను తీసుకోవాలని ప్రయత్నించినా, అది ఇప్పటికి కుదిరింది. ఆమె రాజకీయ రంగ ప్రవేశం ఇందిరాగాంధీ ని గుర్తిచేస్తుందా.. అంటే అవుననే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఆమెకు కూడా రాజకీయాలపట్ల మొదటి నుండి ఉన్న ఆసక్తి దీనికి తోడై, ఇందిరాగాంధీని మరిపించనుందేమో చూడాల్సి ఉంది.
తాజాగా ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ప్రియాంక ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించిన నిమిషాల్లోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 45,500కు చేరుకుంది. కాగా, అకౌంట్ ప్రారంభించినప్పటికీ ప్రియాంక ఎలాంటి ట్వీట్లు చేయలేదు.