telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కోల్‌కతాలో చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబుకు కోల్‌కతా ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. శనివారం కోల్‌కతాలో జరగనున్న బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభలో పాల్గొనడానికి చంద్రబాబు తన బృందంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కోల్‌కతా ఎయిర్ పోర్ట్‌లో చంద్రబాబుకు.. ఎంపీలు డెరిక్ ఒ బెరీన్, దినేష్ త్రివేది పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. 
ఇతర రాష్ట్రాల నుంచి ర్యాలీకి వచ్చిన ముఖ్య నేతలు, పార్టీల అధినేతలతో వరుస భేటీలవుతూ చంద్రబాబు బిజీబిజీగా గడుతపుతున్నారు.అస్సాం మాజీ సీఎం ప్రపూల్‌ కుమార్‌ మెహంతీతో సమావేశమైన చంద్రబాబు సుమారు అరగంట పాటు దేశ రాజకీయాలపై చర్చించారు. శనివారం ర్యాలీ పూర్తయిన అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చంద్రబాబు  దేశ రాజకీయాల విషయమై చర్చించనున్నారు.

Related posts