రైతు రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంగళవారం ఆయన లేఖ రాశారు.
రైతు బంధుపై నిబంధనలు విధించడం సరికాదన్నారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10 కిలోల కోతతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సన్నరకాలకు క్వింటాకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు: టీడీపీ ఎంపీ కేశినేని నాని