ఏపీ రాజధాని కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. రైతులు రోజు రోజుకూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. వారు చేపట్టిన ఆందోళనలు నేటితో 73వ రోజుకు చేరుకున్నాయి.
మందడం, తుళ్లూరులో ధర్నాలు చేస్తున్నారు. అలాగే వెలగపూడిలో 73వ రోజు రిలేదీక్షలు కొనసాగనున్నాయి. అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు కొనసాగిస్తున్నారు. అటు మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్