telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు షాక్.. రేవంత్‌రెడ్డి కరోనా పాజిటివ్‌

revanthreddy campaign in huzurnagar

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఈరోజు వచ్చిన కరోనా బులిటెన్ తో కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు.. తిరిగి కోలుకున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది.. కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ ఉదయం రేవంత్‌రెడ్డి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ఇక, వైద్యుల సూచనలతో హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ రేవంత్‌ తన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. అంతేకాదు.. తనను ఈ మధ్య కాలంలో కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

Related posts