telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్-భారత్ మధ్య ఈరోజు నుండి మూడు వన్డే ల సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే అందులో భాగంగా నేడు జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే భారత్ తరపున ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా, ప్రసిద్ కృష్ణ తమ మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడుతున్నారు. అలాగే రిషబ్ పంత్ కు బదులుగా కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకున్నారు.

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (c), జోస్ బట్లర్ (wk), బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, టామ్ కర్రన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (c), కేఎల్ రాహుల్ (wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ

Related posts