యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రతినాయకుడు రావణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను మొదట ‘అయోధి’ పేరుతో తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నారు. శ్రీ రాముడి జన్మస్థలం అయిన అయోధ్య పేరు కలిసేలా ఈ టైటిల్ అనుకున్నారట. అంతేకాదు ఈ కథను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్కి వినిపించారట కూడా. అయితే హృతిక్ రోషన్ నుంచి పాజిటివ్ స్పందన రాకపోవడంతో.. అదే కథకు ‘ఆదిపురుష్’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రభాస్తో రూపొందించేందుకు ఫిక్స్ అయ్యారట.
previous post