రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. దాగుడు మూతలాట కారణంగా ఏకంగా ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ధాన్యం నిల్వచేసే కంటైనర్ళోకి దూకడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన పిల్లలు 3 నుంచి 8 ఏళ్ల మధ్య వారేనని పోలీసులు తెలిపారు. పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందిన కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బికనేర్ జిల్లాలోని హిమ్మత్సార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్ పూర్తిగా కంటైనర్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు.. అందులోకి దూకి ఆడుకున్నారు. వాళ్లు ఆడుకునే సమయంలోనే కంటైనర్ లాక్ అయిపోయింది. దీంతో పిల్లలు ఊపిరాడక అందులోనే మృతి చెందారు. ఇక, బయటకు వెళ్లి తిరిగివచ్చిన పిల్లల తల్లి.. ఇంట్లో వెతకగా వారు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన చుట్టుపక్కల వెతకసాగింది. ఈ క్రమంలోనే కంటైనర్ ఓపెన్ చేయడంతో అందులో పిల్లలు పడిపోయి ఉండటం గుర్తించింది. కానీ అప్పటికే వాళ్లు మృతి చెందటం గమనించిన ఆమె బోరున విలపించింది.
previous post
అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ