ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దీంతో టాలీవుడ్పై దృష్టి సారించి ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్తో ‘అరవింద సమేత’, మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత ‘హౌస్ఫుల్-4’తో బాలీవుడ్లోనూ సక్సెస్ అందుకుంది. అయితే హిందీలో బాగా గ్యాప్ రావడంపై పూజా తాజాగా స్పందించింది. “తొలి సినిమా ‘మొహంజదారో’ పరాజయం పాలవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఎవరికైనా మొదటి సినిమా ఎంతో కీలకమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా ఫెయిల్ కావడంతో గుండె పగిలినంత పనైంది. అయితే దక్షిణాదిన విజయం సాధించడంతో ధైర్యంగా ముందుకు సాగాను. మొదటి సినిమా విఫలం కావడం వల్లే బాలీవుడ్లో రెండో సినిమాకు సంతకం చేసేందుకు గ్యాప్ తీసుకున్నా. ‘హౌస్ఫుల్-4’ సక్సెస్ సాధించడంతో బాలీవుడ్పై కూడా దృష్టి సారించాను” అని పూజ తెలిపింది.
previous post
మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని… సిద్ధార్థ్ తో గురించి సమంత సంచలన వ్యాఖ్యలు