పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని తెలియజేసిన చిత్రబృందం బిగ్బీకి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే అమితాబ్, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మేకర్స్ అడిగిన వెంటనే బిగ్ బి ఒప్పుకున్నారని తెలుస్తోంది.
Thank you Shahenshah @SrBachchan for the voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/pxpuF6hfMn
— UV Creations (@UV_Creations) February 22, 2022