ఏపీలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు ఏప్రిల్ 5 వరకు, ఈసెట్, ఐసెట్ లకు కు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నామని వివరించారు. ఇంటర్ పేపర్లు దిద్దే ప్రక్రియను కూడా వాయిదా వేశామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నందున గుంటూరు మిర్చి యార్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు.
కరోనా నియంత్రనకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేవారు తప్పకుండా 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. దీన్ని అవమానంగా భావించాల్సిన అవసరం లేదని, వారు సొంత ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు.