ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 14 నుంచి శాసనమండలి నిర్వహిస్తారు.
కాగా అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్న అంశంపై శానససభా వ్యవహారాల కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి సారి అసెంబ్లీ హాజరుకాగా, ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.
కేసీఆర్ను గద్దె దింపే బాధ్యత తీసుకున్నాం: రాజగోపాల్రెడ్డి