telugu navyamedia
రాజకీయ

యూపీలో రెండోసారి బీజేపీ అధికారం..బుల్‌డోజర్‌తో బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రా

*యూపీలో బీజేపీ హ‌వా..వ‌రుసుగా రెండోసారి బీజేపీ అధికారం..

*బీజేపీ కార్యకర్తలు సంబరాలు ..
*గ‌త 30ఏళ్ళ యూపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో రీకార్డును తిర‌గ‌రాసిన బీజేపీ
*సంబ‌రాల్లో పాల్గొన‌బోతున్న‌ మోదీ, అమిత్ షా..

యూపీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హ‌వా కొన‌సాగుతుంది .అధికార పగ్గాలను తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేయడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి .

యూపీ ఫలితాల్లో భారీ మెజారిటీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలో దేశవ్యాప్తంగా కార్యకర్తలు పార్టీ కార్యాలయాల వద్ద వేడుకలు చేసుకుంటున్నారు. కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, కాషాయ జెండాలను చూపుతూ సెలబ్రేషన్స్​ నిర్వహించుకున్నారు. మరికొందరు బుల్డోజర్లపైకి ఎక్కి విజయసంకేతాలు చూపడం గమనార్హం.

గత 37 ఏళ్ల యూపీ చరిత్రలోనే వరుసగా రెండోసారి ఒకే ప్రభుత్వం ఎన్నిక కావడం ఇదే తొలిసారి. అంతేకాక, ఐదేళ్లు సంపూర్ణంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న ఒక సీఎం మళ్లీ ముఖ్యమంత్రి కానుండడం కూడా యూపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

UP ఎన్నికల ఫలితాలు 2022: తాజా ట్రెండ్‌ ఎలా ఉందంటే…

బీజేపీ – 267
సమాజ్‌వాదీ పార్టీ – 131
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ – 1
కాంగ్రెస్ – 2
ఇతరులు – 2

Related posts