రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ – నాందేడ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది. వీరంతా కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు.
రైళ్లు నడవడం లేదన్న ఆలోచనతో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్ మధ్య నడిచే గూడ్స్ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి