ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కు ఫేస్ వాల్యూ లేదని లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర మంగళవారం లోటస్పాండ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ 1994 ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీనీ కబ్జా చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ సమయంలో రూ.3 వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.60 వేల కోట్లకు పెంచి రుణాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత బాబుదేనని మండిపడ్డారు. ప్రపంచబ్యాంక్కు జీతగాడిగా చంద్రబాబు ముద్ర తెచ్చున్నారని ఎద్దేవా చేశారు.
బాబు జీవితమంతా నీచమైన రాజకీయం తప్ప సూటిగా రాష్ట్రానికి ఇది చేశానని ఆయన చెప్పలేరని లక్ష్మీపార్వతి అన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 40 ప్రభుత్వ సంస్థలను మూతవేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ హయాంలో ఐటీ రంగం బాగా వృద్ధి చెందిందన్నారు. లోకేశ్కు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చంద్రబాబు సర్టిఫికేట్ కొనిచ్చారని ఆరోపించారు.