ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజుకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయంగా వీర్రాజుకు ఎంతో అనుభవం ఉందన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన సోము వీర్రాజుకు క్షేత్రస్థాయిలో పేదల సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు.
సేవాతత్పరత కూడా కలిగివున్న వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఏపీలో మరిన్ని విజయాలు సాధించాలని జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పవన్ ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీతో కలిసి ముందుకు సాగుతామని పవన్ వ్యాఖ్యానించారు.