ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీమణి సుప్రవ హరిచందన్ మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆదివారం చికిత్స కోసం సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు నేడు శస్త్రచికిత్సను నిర్వహించనున్నారు. ఆమెకు కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయనున్నట్లు హాస్పిటల్ ఎండీ, జాయింట్ రిప్లేస్ మెంట్ చీఫ్ డాక్టర్ గురవారెడ్డి ఆమెకు స్త్రచికిత్స చేస్తారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ అనంతరం ఆమె కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
జగన్ పాలనలో హడావుడి తప్ప అభివృద్ధి శూన్యం: కన్నా