యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. భారీ చిత్రాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు… “సాహో” రివ్యూ కూడా ఇచ్చేశారు. యూఏఈలో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుందని, అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో వరుసగా ట్వీట్లు పెట్టారు. “సాహో” ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అని, ప్రభాస్ ఎంట్రీ పైసా వసూల్ అని చెప్పారు. యాక్షన్ స్టంట్స్, చేజింగ్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయని, సినిమాలో ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేమని ప్రభాస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “సాహో” సాలిడ్ ఎంటర్టైనర్ అని వెల్లడించాడు. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిపి అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని, ఈ సినిమా గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేస్తుందని, కొత్త రికార్డులను సృష్టిస్తుందని అన్నారు.
ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్పింది చచ్చినట్లు వినండి : పూరి జగన్నాథ్