ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని విషయంపై రూపొందించిన ఓ నివేదికను పవన్ కల్యాణ్ కు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అందించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై జరుగుతోన్న చర్చ అందరికీ తెలుసని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆనందంగా ఉండాలని పవన్ పేర్కొన్నారు. ఒకరికి న్యాయం చేసి, మరొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదని అన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం ఒక అవగాహనకు రావాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
మహాత్మాగాంధీని హత్య చేసిన వారే నాపై దాడి- ఓవైసీ