తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు ఈ రోజు ఉదయం యాదాద్రి నృసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, యాదాద్రి ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులను గవర్నర్కు జగదీశ్ రెడ్డి, అధికారులు వివరించారు. యాదాద్రి ఆలయానికి గవర్నర్ తమిళిసై రావడం ఇదే తొలిసారి. మధ్యహ్నం వరంగల్ నగరానికి చేరుకొని, అక్కడి కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను గవర్నర్ పరిశీలించనున్నారు.
సీఎం కెసిఆర్ కు బండి సంజయ్ కౌంటర్..