telugu navyamedia
క్రీడలు వార్తలు

జట్టులో చేరిన రోహిత్…

hitman rohit duck out

సిడ్నీలో 14 రోజుల నిర్బంధ సమయాన్ని పూర్తి చేసుకున్న తరువాత భారత ఓపెనర్ రోహిత్ శర్మ మెల్బోర్న్ లో టీం ఇండియా ను కలిసాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 లో గాయపడిన రోహిత్ వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేసి 2వ టెస్ట్ కంటే ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. కానీ అక్కడికి చేరిన తర్వాత పాటించాల్సిన కరోనా నియమాల కారణంగా ఈ మ్యాచ్ లో ఆడలేకపోయాడు. ఇక తాజాగా తన క్వారంటైన్ సమవని ముగించుకున్న హిట్ మ్యాన్ మిగిత జట్టు సభ్యులను కలుసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే 4 మ్యాచ్ ల ఈ సిరీస్ లో అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పరాజయం పొందిన టీం ఇండియా బాక్సింగ్ డే టెస్టులో విజయం తో సిరీస్ ను 1-1తో సమం చేసింది. అయితే అయితే సిడ్నీలో జరిగే 3వ టెస్టుకు ఇంకా 7 రోజులు ఉండటంతో, రోహిత్ కు శిక్షణ తీసుకోవడానికి తగినంత సమయం ఉంది. చూడాలి మరి జనవరి 7 నుంచి సిడ్నీలో ప్రారంభం కానున్న మూడో టెస్టులో రోహిత్ కు తుది జట్టులో స్థానం దక్కుతుందా… లేదా అలాగే ఈ మ్యాచ్ లో విజయం ఎవరిది అనేది.

Related posts