telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లా నాయక్’ వ‌చ్చేస్తున్నాడు..

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘భీమ్లా నాయక్‌ . సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యమేనన్, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు.

 మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు కూడా చేసారు. ఒరిజినల్ ఉన్నదున్నట్లు తీస్తే ఇద్దరి కారెక్టర్స్ సేమ్ టూ సేమ్ ఉంటాయి. ఓ డబ్బున్న వ్యక్తి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు.,[object Object]

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదైల‌న పోస్ట‌ర్స్‌, సాంగ్స్ యూట్యూబ్‌ని షేక్ చేశాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి

తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో తెలిపారు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల కానుంది. రేపు (శనివారం) ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

bheemla nayak censor

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

Related posts