సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా, కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వాలైంటెన్స్ డే సందర్భంగా కళావతి సాంగ్ రిలీజైంది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి.
ఇప్పటివరు ఈ సాంగ్కు యూట్యూబ్లో 29 మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. సెన్సేషనల్గా మారిన ఈ హిట్ పాటకు తమన్ సంగీతం అందించగా సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిత్రయూనిట్ మహేశ్, కీర్తి సురేశ్ ఫన్నీ మూమెంట్స్ను చూపించారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 12న విడుదలవుతోంది.
నా దెబ్బకు విజయ్ మరో రెండేళ్ల వరకు సినిమా చేయడు : రష్మిక మందన్న