telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీలో సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్..

ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నుంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

అలాగే సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విలేకర్లతో ముచ్చటించింది.

ఈ సమయంలో ఏపీలో మూవీ టికెట్‌ ధరలపై ఇవాళ జరిగిన ప్రెస్‌ మీట్‌లో హీరో ప్రభాస్‌ స్పందించారు. రాధేశ్యామ్‌ విడుదలకు ముందే టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తానని ప్రభాస్‌ చెప్పారు. గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మధ్య సినిమా టికెట్స్ ధరల విషయంలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Related posts