విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసల కురిపించారు. ఆయన తన పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని అన్నారు. విశాఖలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం లక్ష్మీనారాయణ ప్రజాజీవితంలోకి వచ్చారని కితాబిచ్చారు. సముద్రమంత లోతైన వ్యక్తి లక్ష్మీనారాయణ అని కొనియాడారు. ధైర్యం ఉన్నవాళ్లు పెద్దపెద్ద మాటలు మాట్లాడరని అన్నారు. తొడలు కొట్టి జైలుకు వెళ్తే, బయటకు రావడానికి పదేళ్లు పడుతుందని పవన్ పేర్కొన్నారు.
previous post