telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కొడాలి నాని వ్యాఖ్యలు జగన్‌కు వినిపిస్తున్నాయా?: పరిపూర్ణానంద

Swami-Paripoornananda bjp

తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులకు డిక్లరేషన్ ఎందుకని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడడానికి తాము పోరాడతామని చెప్పారు.

దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అన్నారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎ జగన్‌కు వినిపిస్తున్నాయా? అని  ప్రశ్నించారు. జగన్ ఈ విషయంపై స్పందించకపోతే ఆ వ్యాఖ్యలను ఆయనే చేయించారని భావించాల్సి వస్తుందని చెప్పారు.

శ్రీవారి దర్శనానికి వెళ్లే వారు తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని అన్నారు.తిరుమల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ లేదని చెప్పారు. వివాదాలను మరింత పెంచేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేవలం హిందూ దేవాలయాల గురించే కొందరు నేతలు మాట్లాడుతున్నారని, ఆ హక్కు వారికి లేదని అన్నారు. కొడాలి నాని అన్ని విషయాలను సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Related posts