telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

భారత్ అదుపులో.. పాక్ గూఢచారి.. ! కొనసాగుతున్న పాక్ కవ్వింపు చర్యలు.. !!

young man arrested for selfie in polls

ఓ గూఢచారి భారత ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నట్టు తెలుసుకొని, అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన రాజ్ కుమార్ స్థానికంగా ఉండే ఆర్మీ స్థావరాల వివరాలతో పాటు సైనికుల కదలికలపై పూర్తి సమాచారాన్ని పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చేరవేస్తున్నట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.

రాజ్ కుమార్ నుంచి రెండు ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. భారత్-పాక్ సరిహద్దులో ఉన్న ఆర్మీ పోస్టుల వివరాలను నిందితుడు ఐఎస్ఐ వర్గాలకు అందజేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాట్సాప్ ద్వారా రాజ్ కుమార్ ఐఎస్ఐ ఏజెంట్ కు సమాచారం పంపేవాడనీ, ఇందుకు ప్రతిగా నగదును అందుకునేవాడని పేర్కొన్నారు. తాను నేరం చేసినట్లు రాజ్ కుమార్ అంగీకరించాడని అన్నారు.

అంతేకాకుండా స్థానికంగా సిమ్ కార్డులను కొనుగోలుచేసిన రాజ్ కుమార్ పాకిస్థానీ ఐఎస్ఐ హ్యాండ్లర్లకు అందించాడని విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం-1920, ఐపీపీ 120బీ కింద కేసు నమోదుచేశామని తెలిపారు.

Related posts