రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానది ఉగ్రరూపం దాల్చింది. కాన్పూర్ వద్ద ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుంది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో, ప్రయాగ్రాజ్లో ఉన్న పాఠశాలలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
దీంతో ముందు జాగ్రత్తగా మూడురోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 210 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.