telugu navyamedia
రాజకీయ వార్తలు

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

Mp Govrnor posses away

శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు. టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ లాల్జీ మృతిని ధ్రువీకరించారు. శ్వాసకోశ సమస్యలు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

దీంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు కేంద్రం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాల్జీ పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించింది. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం మానేసింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఈ ఉదయం మృతిచెందినట్టు మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు.

 

Related posts