హీరోయిన్ పాయల్ ఘోష్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడితో కొందరు హీరోయిన్లు పడక సుఖం పంచుకున్నారంటూ పేర్లు వెల్లడించింది. అనురాగ్పై ఆరోపణలు చేస్తూ హీరోయిన్లు హ్యూమా ఖురేషి, రిచా చద్దా పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో తన పరువుకు భంగం కలిగించిందని పేర్కొంటూ పాయల్పై రిచా పరువు నష్టం కేసు వేసింది. రూ.1.1 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ఆ కేసు గురించి తాజాగా పాయల్ స్పందించింది. “రిచా చద్దాకు వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు. ఆమె పరువును దిగజార్చే విధంగా నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆమెను ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా కలవలేదు. ఆమె గురించి అనురాగ్ మాట్లాడిన మాటలను మాత్రమే నేను చెప్పాను. తన పేరు ప్రస్తావించినందుకు అనురాగ్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయాలి. అనురాగ్ వల్ల తప్ప తన నుంచి రిచాకు ఎలాంటి నష్టమూ జరగలేదు” అని పేర్కొంది.
కాగా ఈ వ్యవహారంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాయల్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అనురాగ్ కాశ్యప్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో అనురాగ్ కాశ్యప్ ను పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు. పాయల్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అనురాగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించాడు. తాజాగా పాయల్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. తనకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కిషన్ రెడ్డికి పాయల్ లేఖ అందజేశారు. ఆ విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది పాయల్.
Met up with Shri G Krishan Reddy who is the MOS of @AmitShah ji at @HMOIndia and also the minister of state of home ministry and had a very fruitful and forwarded conversation on the issue. It’s an issue faced by many and now is the time to act. pic.twitter.com/euvBnFbbyy
— Payal Ghosh (@iampayalghosh) October 7, 2020