ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఎ31 (2020) ని ఇండోనేషియా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఇందులో సరికొత్త ఫీచర్లను అమర్చింది. 6.5 ఇంచుల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 5.0, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.13,500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. త్వరలోనే ఈ ఫోన్ను ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశముంది.