telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాళ్ళు పిచోళ్ళు అంటున్న కేటీఆర్…

ktr telangana

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ పెద్దల పర్యటనలపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వరదల్లా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్రమంత్రులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. హైదరాబాద్‌ వరదలు, వర్షాలతో అల్లాడుతున్నప్పుడు కేంద్రమంత్రులు వచ్చి ఉంటే బాగుండేదన్నారు కేటీఆర్. కేంద్రమంత్రులు ఉత్త చేతులతో కాకుండా..వరదసాయం రూ.1,350 కోట్లు తీసుకువస్తారని ఆశిస్తున్నారని తెలిపారు కేటీఆర్. కేంద్రం ను వరద సాయం చేయమని అడిగితే… ఉలుకు లేదు పలుకు లేదు ఉప్పల్ కి మేము ఐటీ తెస్తామని అంటే…వాళ్ళు ఉప్పల్ కి కర్ఫ్హ్యు తెస్తామని అంటున్నారు. మార్కెట్ల కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా ? డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చే బాధ్యత మాది అని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్ట్ లు ఏమి ఇవ్వరు, 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోదికి ఓటు వేయండి…రాని వాళ్ళు మాకే వేయండి అని అన్నారు. ఒక పిచ్చోడు ఎన్టీఆర్, పివి సమాధులు కులగొట్టాలని అంటాడు….ఇంకో పిచ్చోడు చాలన్ లు కడుతా అంటాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చూడాలి మరి దీని పై వారు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts