“కరోనా” నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ.
• డిసెంబర్ 1 నుంచి 31 వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలిపిన కేంద్ర హోంశాఖ.
• “కంటైన్మెంట్ జోన్ల” ఆవల ఆంక్షలు విధించాలని అనుకుంటే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని స్పష్టం.
• కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సూక్ష్మ స్థాయిలో “కంటైన్మెంట్ జోన్ల”ను ఏర్పాటు చేయాలి.
• “కంటైన్మెంట్ జోన్ల” వివరాలను జిల్లా కలెక్టర్లు వెబ్సైట్లలో పొందుపర్చాలి.
• ఆ సమాచారాన్ని కేంద్ర వైద్య శాఖకు అందించాలి.
• రోజువారీ అవసరాలు మినహా “కంటైన్మెంట్ జోన్ల”లో ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి.
• కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలి.
• పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు “క్వారంటైన్“లో ఉంచాలి.
• జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు “కరోనా” నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షించాలి.
• ఆయా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంచాలి.
• ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.
• మాస్కులు ధరించనివారికి జరిమానాలు విధించే అవకాశాన్ని రాష్ట్రాలు పరిశీలించాలి.
• “కరోనా” నిర్వహణకు జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలను పాటించాలి.
• అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్ హాళ్లపై నిషేధం కొనసాగుతాయని స్పష్టం.
• సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కొనసాగింపు.
• వీటిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడించిన కేంద్ర హోంశాఖ.
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే