టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కమిటీల నియామకం, మార్పులపై కసరత్తు చేస్తున్నారు. సీనియర్లు, అనుబంధ విభాగాల నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. దసరా రోజున సంస్థాగత ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తారు. నవంబర్ 30లోపు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కమిటీల్లో బలహీన వర్గాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. 33 శాతం మహిళలు, 33 శాతం యువతకి కమిటీల్లో అవకాశం ఇవ్వనున్నారు.