telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ లో మరో తెలుగు రీమేక్

'Ninu Veedani Needanu Nene' Second Look released

“బాహుబ‌లి” భారీ విజయం తరువాత తెలుగు ప‌రిశ్ర‌మ స్థాయి రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం అన్ని ఇండ‌స్ట్రీలు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. తెలుగులో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. తాజాగా సందీప్ కిషన్ నిర్మించిన “నిను వీడ‌ని నీడ‌ను నేనే” చిత్రాన్ని రీమేక్ చేసేందుకు హిందీ మేక‌ర్స్ ముందుకొచ్చారు. ఈ విష‌యాన్ని సందీప్ కిష‌న్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “స్త్రీ” చిత్ర నిర్మాతలు, “షోర్ ఇన్ ది సిటీ” ద‌ర్శ‌కులు రాజ్‌, డీకేలు. వారు నా మార్గదర్శకులు, సోదరులు… నా సినిమా రీమేక్‌ రైట్స్ వారు తీసుకున్నారు. నా సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది” అని సందీప్ త‌న ట్వీట్ లో తెలిపాడు. ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిషన్ తెలుగు, తమిళ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. తొలిసారి థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకున్నాడు. తనే నిర్మాతగా మారి మిత్రులతో కలిసి “నిను వీడని నీడను నేనే” అంటూ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించాడు. కొత్త దర్శకుడు కార్తిక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాజాగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ సినిమాని వేరే భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వుతున్నాయి.

Related posts