“అల.. వైకుంఠపురములో” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. తన తర్వాతి సినిమాని తారక్తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ సినిమాకు పెడుతున్న టైటిల్ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎప్పటిలాగే సెంటిమెంట్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తను తర్వాత తీయబోయే సినిమాకు ‘అ’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాకు సంబంధించిన వర్క్ని మే వరకు పూర్తి చెయ్యనున్నారు. తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు పూర్తి కథను సిద్ధం చేసి త్రివిక్రమ్ తారక్కి వినిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఫిల్మ్ నగర్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కథను ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో రాసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఓ పవర్ఫుల్ పొలిటిషన్ రోల్లో తారక్ నటించనున్నాడనేది లేటెస్ట్ గా వినబడుతున్న టాక్.
previous post
next post
ఇప్పటికే 20 సార్లు పెళ్లైపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్