telugu navyamedia
రాజకీయ వార్తలు

మూడు యుద్ధాల్లో పాక్ మట్టికరిచింది: మోదీ

one nation one day salary slogan by modi

దాయాది దేశం పాకిస్థాన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా భారత్ తో పాకిస్థాన్ చేస్తున్న పరోక్ష యుద్ధంలో వేలాది మంది జవాన్లు అమరులయ్యారని తెలిపారు. మనతో చేసిన మూడు యుద్ధాల్లో పాక్ మట్టికరిచిందని చెప్పారు. అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదని విమర్శించారు. పాక్ పరోక్ష యుద్ధాన్ని గత ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోలేదన్నారు. కేవలం శాంతిభద్రతల సమస్యగానే దాన్ని చూశాయని మోదీ విమర్శించారు.

పాక్ పై దాడి చేస్తామని సైన్యం కోరినా అనుమతించలేదని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను నిలువరించకుండా… సమస్య పెద్దది అయ్యేలా వ్యవహరించారని అన్నారు. కశ్మీర్ సమస్యను 70 ఏళ్లుగా కొన్ని పార్టీలు, కొన్ని కుటుంబాలు సజీవంగా ఉంచాయని తెలిపారు. తీవ్రవాదం పెరగడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు.

Related posts