telugu navyamedia
సినిమా వార్తలు

సాహో అప్డేట్ : 8 నిమిషాల యాక్షన్ సీన్ కోసం 70 కోట్లు…!!

Saaho

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో చిత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్ . హై బ‌డ్జెట్‌తో పాటు భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 9, 2017న సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్ర షూటింగ్ జూలై 15, 2019న ముగిసింది. అంటే దాదాపు 25 నెల‌లు సాహో కోసం ప‌ని చేశాడు ప్ర‌భాస్. సాహో చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో సెట్‌లో ప్ర‌భాస్ కేక్ క‌ట్ చేశారు. టీం మెంబ‌ర్స్ అంద‌రికి కేక్ తినిపించారు. వారితో క‌లిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో “సాహో” గురించి మరో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసిందే. సినిమాలో అధిక ప్రాముఖ్య‌త ఉన్న యాక్ష‌న్ పార్ట్‌లో కీల‌క స‌న్నివేశాన్ని అబుదాబిలో చిత్రీక‌రించారు. సినిమాలో 8 నిమిషాల పాటు సాగే చేజింగ్ సీన్ ఉంది. ఆ స‌న్నివేశాన్ని 70 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో తెర‌కెక్కించారని సినీ వ‌ర్గాల స‌మాచారం.

Related posts