telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అమ్మ ఒడిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేశ్

suresh adimulapu minister

‘అమ్మ ఒడి’ పథకంపై నెలకొన్న గందరగోళం పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు శాసనసభలో ఆయన ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ప్రభుత్వం 43 లక్షల మందికే ‘అమ్మ ఒడి’ వర్తింపచేస్తున్నట్టు ప్రకటించిందని, రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు అందుకు మంత్రి ఆదిమూలపు బదులిస్తూ, పిల్లల్ని చదివిస్తున్న తల్లిని దృష్టిలో పెట్టుకునే తాము ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు.

పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తున్నట్టు వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏపీ సర్కారు ఇదే విషయాన్ని తెలిపింది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తాజాగా మంత్రి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

Related posts