గత ఏడాది ఇటు తెలుగు, అటు తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కీర్తి సురేష్ ఈ ఏడాది ఒక్క సినిమాతోను పలకరించలేదు. కాకపోతే ఆమె నటిస్తున్న పలు ప్రాజెక్టులు మాత్రం సెట్స్పై ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన మన్మథుడు 2 చిత్రంలో గెస్ట్ రోల్తోనే సరిపెట్టుకున్న కీర్తి “మిస్ ఇండియా” అనే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు హిందీ, తమిళంలోను సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్న ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించనుండగా, ఈ చిత్రం రీసెంట్గా సెట్స్పైకి వెళ్ళింది. కీర్తి 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రణాళికలు వేస్తున్నారు.
Our ProductionNo3 #KeerthySuresh24
SHOOT STARTS TODAY.
We look forward for your wishes and support @karthiksubbaraj @KeerthyOfficial @Music_Santhosh @kaarthekeyens @EashvarKarthic @Madhampatty @insidekarthik @linga_offcl pic.twitter.com/qoRIjUkXTG
— StoneBench Films (@StonebenchFilms) 12 September 2019