టాలీవుడ్లో షూటింగ్స్ సందడి పెరిగిపోతోంది. సీనియర్లు, స్టార్ హీరోలు సెట్స్లో అడుగుపెట్టడంతో ఇండస్ట్రీకి కొత్త జోష్ వస్తోంది. టాప్ హీరోలు సెట్స్కి రాగానే సందడి మొదలైంది. షూటింగులకి పర్మిషన్లు ఇచ్చాక కూడా చాలా రోజులు టైమ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ నవంబర్ ఫస్ట్ నుంచి “వకీల్సాబ్’లో సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఫుల్ స్పీడ్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ అవైటడ్ మూవీ “ట్రిపుల్ ఆర్’ కూడా షూటింగ్ మొదలుపెట్టేసింది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్తో యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ప్రభాస్ “రాధేశ్యామ్’ రీసెంట్గానే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. కరెక్ట్ లొకేషన్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన “పుష్ప’ టీమ్ కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది. కేరళ ఫారెస్ట్లో షూటింగ్ చెయ్యాలనుకున్న టీమ్, కరోనా ప్రభావంతో మనసు మార్చుకుంది. తెలుగు స్టేట్స్లోనే షూట్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో “పుష్ప’ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది. రోనా లాక్డౌన్ కంటే ముందే బ్రేక్ తీసుకున్న సినిమా “ఆచార్య’. ఇక ఇన్నాళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నవంబర్ 9 నుంచి ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇక కరోనా ప్రభావం తగ్గే వరకు షూటింగ్కి వెళ్లనని చెప్పని బాలక్రిష్ణ కూడా బోయపాటి సినిమా సెట్స్లో అడుగుపెట్టేశాడు. అక్టోబర్ లాస్ట్ వీక్లో బీబీ3 షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. సీనియర్స్లో అందరికంటే ముందే షూటింగ్ మొదలుపెట్టిన హీరో నాగార్జున. “బిగ్బాస్4′ ప్రోమోస్తో కెమెరా ముందుకెళ్లిన నాగ్, “వైల్డ్ డాగ్’ మనాలీ షెడ్యూల్ని పూర్తి చేస్తున్నాడు. వెంకటేశ్ “నారప్ప’ షూటింగ్ కూడా రీస్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ సరౌండింగ్స్లో “నారప్ప’ షూటింగ్ జరుగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేశ్ బాబు మాత్రమే ఇంకా షూటింగ్కి వెళ్లలేదు. అయితే అమెరికా వీసాలు రాగానే “సర్కారు వారి పాట’ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడట మహేశ్ బాబు. ఇక టాలీవుడ్ టాప్ హీరోలు కూడా షూటింగుల్లో జాయిన్ కావడంతో ఇండస్ట్రీకి బోల్డంత ఎనర్జీ వస్తోంది. చాన్నాళ్ల తర్వాత రోజూ వర్క్ ఉంటుందని కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు