మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్రస్తుతం చిలసౌ ఫేం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో “మన్మథుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇటీవలే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన టీజర్ ను “మీట్ అవంతిక” అంటూ విడుదల చేశారు. ఈ టీజర్లో అవంతిక “ఇప్పటి వరకు యు సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇకపై ఏ సర్టిఫికెట్ చూపిస్తా…” అంటూ రకుల్ నాగ్తో చెప్పే డైలాగ్తో పాటు రకుల్ సిగరెట్ తాగి పొగ వదిలే సీన్లో కనపడింది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై రకుల్ స్పందించింది. `మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వారి పనే అది కదా. ఇటీవల విడుదలైన `కబీర్ సింగ్`లో షాహిద్ సిగరెట్ కాల్చారు. కానీ, నిజ జీవితంలో ఆయన పొగ తాగరు. సినిమాను, నిజ జీవితాన్ని కలిపి చూడకూడదు. పాత్ర పరంగా సినిమాలో సిగరెట్ కాల్చాల్సి వచ్చింది. అలా ఎందుకు కాల్చాల్సి వచ్చిందో సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు ట్రోలింగ్ అలవాటైపోయింది. నేను పట్టించుకోవడం ఎప్పుడో మానేశా. ఎందుకంటే నాకు అంతకంటే ముఖ్యమైన పనులున్నాయి” అని రకుల్ చెప్పింది.
previous post
next post
నవదీప్ అంటే అసహ్యం… సిక్స్ ప్యాక్ ఫోటోషాప్… మంచు విష్ణు వ్యాఖ్యలు