‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఫస్ట్లుక్ను ఈ మధ్యే విడుదల దేశారు. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ నటి నివేదా థామస్ను చిత్ర యూనిట్ సంప్రదించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. నాని సరసన ‘జెంటిల్మన్’తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నివేదా. ఇప్పుడు బన్నీతో కూడా నటించే అవకాశం కూడా అమెకు లభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
previous post