telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పంజా విసిరిన సైతాన్.. సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మోషన్ పోస్టర్ 

ప్రతిభగల దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సైతాన్’. ఇటీవల వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ కి తగ్గట్లుగానే మోషన్ పోస్టర్ చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. మోషన్ పోస్టర్ వెబ్ సిరీస్ పై మంచి బజ్ తీసుకువచ్చింది. ‘మీరు దాన్ని నేరం అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటారు’ అనే థీమ్ తో మహి వి రాఘవ్ ఈ సిరీస్ తెరకెక్కించారు.

మోషన్ పోస్టర్ గమనిస్తే.. అందులో చూపిస్తున్న ఫ్యామిలీ తమ మనుగడ కోసం ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధం అయినట్లు.. ఎలాంటి నేరం చేయడానికి అయినా సిద్ధం అయినట్లు కనిపిస్తున్నారు. ఫ్రేమ్ లో కనిపిస్తున్న ప్రతి నటుడు భయాన్ని కలిగించే హావభావాలతో ఆకట్టుకుంటున్నారు. వాళ్ళు అలా ఎందుకు మారారు ? వారి ఫ్యామిలిలో జరిగిన సంఘటనలు ఏంటి ? అనే అంశం వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

ఈ వెబ్ సిరీస్ లో రిషి, షెల్లీ, దేవియాని , జాఫర్ చాలా ఇంటెన్స్ రోల్స్ లో నటించారు. మోషన్ పోస్టర్ అందరికీ నచ్చినందుకు, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినందుకు సంతోషంగా ఉందని దర్శకుడు మహి వి రాఘవ్ అన్నారు.

ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ నుంచి మరో కీలక అప్డేట్ ఏంటంటే జూన్ 5న సైతాన్ ట్రైలర్ రిలీజ్ కానుంది. కానీ దర్శకుడు చిన్న హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి కంటెంట్ చూసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ వెబ్ సిరీస్ చాలా వైలెంట్ గా ఉండబోతోంది అని మహి వి రాఘవ్ అన్నారు. సైతాన్ వెబ్ సిరీస్ వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ డ్రామాగా అలరించబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Related posts