telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజకీయ పార్టీ నేతలతో నిమ్మగడ్డ భేటీ

వివిధ రాజకీయ పార్టీ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సమావేశానికి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మరణించిన అభ్యర్ధుల స్ధానంలో వచ్చిన నామినేషన్ల అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నామినేషన్ల గందరగోళం.. బలవంతపు ఉప సంహరణల విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి ప్రతిపక్ష పార్టీలు తీసుకెళ్లాయి. వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలనే నిబంధనపై అధికార పార్టీ అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలను ఎస్ఈసీ నిమ్మగడ్డ సహకారం కోరనున్నట్లు సమాచారం.

Related posts